రాబోయే రోజుల్లో ఒక బిజినెస్ హబ్గా మారబోతున్న తెలంగాణలో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని నాణ్యమైన విద్యుత్ అందుబాటులో ఉండేలా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశించారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క గారితో కలిసి విద్యుత్ శాఖపై ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు. రాష్ట్రంలో విద్యుత్ రంగం, ప్రజల అవసరాలకు అనుగుణంగా తీసుకోవలసిన చర్యలపై పలు సూచనలు చేశారు.
🔹 రాష్ట్రంలో డిమాండ్కు తగ్గ ఉత్పత్తి చేసేందుకు వీలుగా సోలార్ విద్యుత్ ఉత్పత్తి, వినియోగం పెరిగేలా చర్యలు.
🔹 వివిధ శాఖల పరిధిలో నిరుపయోగంగా ఉన్న భూముల్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తి.
🔹 సోలార్ విద్యుత్ను ప్రోత్సహించడానికి రైతులకు ఉచితంగా సోలార్ పంప్సెట్లు.
🔹 అందుకు కొండారెడ్డిపల్లెలో పైలట్ ప్రాజెక్టు.
🔹 వంటగ్యాస్ బదులుగా సోలార్ విద్యుత్ వినియోగ విధానం. మహిళా సంఘాలకు శిక్షణ.
🔹 అటవీ భూముల్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తికి చర్యలు.
🔹 ప్రతీ ఏటా 40వేల మెగావాట్స్ విద్యుత్ అందుబాటులో ఉండే విధంగా కార్యాచరణ.
🔹 ఓవర్ లోడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం, అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయడం.