ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారిని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఛైర్మన్ ఖలీద్ సైఫుల్లా రహ్మాని గారు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ గారు శుక్రవారం రాత్రి జుబ్లీహిల్స్ లోని సీఎం నివాసంలో కలిశారు. వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై తమ అభిప్రాయాలను వారు ముఖ్యమంత్రి గారికి తెలియజేశారు. ఈ భేటీలో TMRIES ఛైర్మన్ ఫహీం ఖురేషి గారు కూడా ఉన్నారు.